పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపరచిన వెబ్సైట్లో నమోదు చేసుకోండి. (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా)
- ప్రతి ఒక పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
- నవంబరు 2013 ఒకటవ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
- విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు
- శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
- దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా జతపరచాలి
- ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నవారు తమ సంస్థ అధికారి ద్వారా ధ్రువీకరణపత్రం జతపరచి సంస్థలోని వారందరి దరఖాస్తులు ఒకే వ్యక్తి ద్వారా పంపవచ్చును. వీరు డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలు జతపరచనక్కర్లేదు. ఆ అధికారికి గెజిటెడ్ హోదా ఉండాలి
- డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రిజిస్టర్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్, రూల్స్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్, రిజిస్టర్ ఆఫ్ ఇంజనీర్స్ తమ అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
- ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులు డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్కాపీని గెజిటెడ్ అధికారి చేత ధ్రువీకరించి దరఖాస్తుకు జతపరచాలి. ఆ దరఖాస్తును వ్యక్తిగతంగా ఓటరు నమోదు అధికారికి అందజేసి రసీదు పొందాలి. దరఖాస్తు స్వీకరించే అధికారికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపాల్సి ఉంటుంది.
- ఆన్లైన్లో నమోదు చేసుకునేవారు సీఈవో ఆంధ్రా.ఎన్ఐసీ.ఇన్ (నాల్గవ రకం ఏబీసీడీ) వెబ్సైట్ నందు ఇ-రిజిసే్ట్రషన్ కౌన్సిల్ ఠి ఫోరం18లోనికి వెళ్లి నమోదు చేయాలి. ఫోటో ధ్రువీకరించి సర్టిఫికేట్స్ స్కాన్చేసి అప్లోడ్ చేయాలి
- దరఖాస్తులు మొత్తంగా ఒకటికంటే ఎక్కువగా ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించే వీలులేదు
- ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరివి ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి రసీదు పొందవచ్చు, మనకు నెల్లూరుమున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ (నమోదు అధికారి)
- అసోసియేషన్ ద్వారా ఓటరు దరఖాస్తులను సేకరించి అధికారులకు సమర్పించే వీలులేదు.
No comments:
Post a Comment