Friday, 14 October 2016

పట్టభద్రుల  శాసనమండలి ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పొందుపరచిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోండి. (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓటరుగా)
  • ప్రతి ఒక పట్టభద్రుడు ఓటు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
  • నవంబరు 2013 ఒకటవ తేదీ నాటికి పట్టభద్రుడై ఉండాలి
  • విద్యార్హతను పరీక్షా ఫలితాలు ప్రకటించిననాటి నుంచే లెక్కిస్తారు
  • శాసనసభ నియోజకవర్గంలో ఓటరుగా ఉంటే ఆ వివరాలు పొందుపరిస్తే మంచిది
  • దరఖాస్తుతో ఫోటో తప్పనిసరిగా జతపరచాలి
  • ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్నవారు తమ సంస్థ అధికారి ద్వారా ధ్రువీకరణపత్రం జతపరచి సంస్థలోని వారందరి దరఖాస్తులు ఒకే వ్యక్తి ద్వారా పంపవచ్చును. వీరు డిగ్రీ సర్టిఫికేట్లు జిరాక్స్‌ కాపీలు జతపరచనక్కర్లేదు. ఆ అధికారికి గెజిటెడ్‌ హోదా ఉండాలి
  • డాక్టర్లు, ఆడిటర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రిజిస్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ప్రాక్టీస్‌, రూల్స్‌ ఆఫ్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌, రిజిస్టర్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తమ అర్హతను ధ్రువీకరించుకోవచ్చు.
  • ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులు డిగ్రీ సర్టిఫికేట్‌ జిరాక్స్‌కాపీని  గెజిటెడ్‌ అధికారి చేత ధ్రువీకరించి దరఖాస్తుకు జతపరచాలి. ఆ దరఖాస్తును వ్యక్తిగతంగా ఓటరు నమోదు అధికారికి అందజేసి రసీదు పొందాలి. దరఖాస్తు స్వీకరించే అధికారికి ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ చూపాల్సి ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేవారు సీఈవో ఆంధ్రా.ఎన్‌ఐసీ.ఇన్‌ (నాల్గవ రకం ఏబీసీడీ) వెబ్‌సైట్‌ నందు ఇ-రిజిసే్ట్రషన్‌ కౌన్సిల్‌ ఠి ఫోరం18లోనికి వెళ్లి నమోదు చేయాలి. ఫోటో ధ్రువీకరించి సర్టిఫికేట్స్‌ స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాలి
  • దరఖాస్తులు మొత్తంగా ఒకటికంటే ఎక్కువగా ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించే వీలులేదు
  • ఒకే కుటుంబంలో పట్టభద్రులు ఉంటే అందరివి ఒకే వ్యక్తి తీసుకెళ్లి సమర్పించి రసీదు పొందవచ్చు, మనకు నెల్లూరుమున్సిపల్‌ కార్పోరేషన్ కమిషనర్ (నమోదు అధికారి)
  • అసోసియేషన్ ద్వారా ఓటరు దరఖాస్తులను సేకరించి అధికారులకు సమర్పించే వీలులేదు.

No comments: