Saturday, 28 March 2015

శ్రీరాముడు ముల్లోకాలనీ కాపాడిన అవతార మూర్తి, అటువంటి రామచంద్రుడు ఈ రోజు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రములో జన్మించాడు.  శ్రిరామచంద్రుల వారి జన్మోత్సవమును కళ్యాణోత్సవమును రామముర్తినగర్లో నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకము

అటువంటి శ్రీరామ చంద్రమూర్తి  – సీతమ్మ తల్లి కళ్యాణానికి మిధిలానగరం వలె మన రామముర్తినగర్లో  గుడిగుంట్ల బాలపిరయ్య కళ్యాణమండపములో వేదికను ఏర్పాటు చేసారు,సీతారామ కల్యాణానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ,  మీరందరు ఆనందంతో ,సుఖ సంతోషాలతో వుండాలని కోరుకుంటూ 
.
మీ SRIKANTAM RAMANAIAH

sriramanavami



Sunday, 22 March 2015

 ప్రపంచనగరంగా ఆంధ్రప్రదేశ్‌ నూతన  రాజధానిని నిర్మిస్తామని  AP ముఖ్యమంత్రి          N చంద్రబాబు నాయుడు మన్మధనామ సంవత్సర సందర్భంగా స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది . అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా అమరావతి పేరు అధికారిక ప్రకటనే తరువాయి,  రాజధాని ప్రాంతంగా తుళ్లూరును ఎంపిక చేసినా , చారిత్రక ప్రాధాన్యత, స్థల పురాణాలు, ప్రాచీన వైభవం దృష్ట్యా అమరావతి పేరే చివరకి.
మొబైల్‌ ద్వారా ఓటరు EPIC నెంబరును అదార్తో అనుసందానించాలనుకొనే వారు.. వారి మొబైల్‌ నుంచి ‘SEEDEPIC’’ అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఓటర్‌ ఐడీ కార్డు నెంబర్‌ టైప్‌ చేసి, స్సేస్‌ ఇచ్చి, ఆధార్‌ కార్డు నెంబర్‌ను టైప్‌ చేసి.. 8790499899 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. 
ఒకే వ్యక్తి పేరు మీద రెండు ఓటర్‌ కార్డులు లేకుండా ఉండే ప్రప్రథమ దేశంగా భారత దేశము అవతరించనుంది. ఓటర్‌ ఐడీ కార్డులను బయో మెట్రిక్‌ సమాచారం ఉన్న ఆధార కార్డుకు లింక్‌ చేయడం ద్వారా ఒక పేరుపై ఉన్న పలు ఓటర్‌ కార్డులకు స్వస్తి పలికే చర్యను ఎన్నికల కమిషన్‌ చేపట్టిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ ఎస్‌ బ్రహ్మ చెప్పారు. 

Tuesday, 17 March 2015

మార్చి21 న తెలుగు మన్మధ నామ సంవత్సరం, రాత్రి - పగలు సరిసమానంగా ఉండే రోజు, మరలా తిరిగి 2034వ సంవత్స్రములో ఆనందనామ సంవత్సర ఉగాదిగా వస్తుంది అందరికి షడ్రుచుల మన్మధనామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు `లోకాస్సమస్తా:సుఖినో భవన్తు` 
  శ్రీకంఠం రమణయ్య

Friday, 6 March 2015

మన రామముర్తినగర్ ఓనర్స్ అసోసియేషన్ ఆద్వర్యములో ప్రపంచ మహిళా దినోత్సవం (తృతీయ ) గుడిగుంట్లలక్ష్మి రాజ్యం సెంట్రల్ ఎ.సి హాల్, 3వ మెయిన్ రోడ్డు నందు మార్చి నెల 08వ తేది 2015 నాడు ఉదయం గం:11కి జరుగును రామముర్తినగర్లోని మహిళలందరూ,పిల్లలు - పెద్దలందరూ రావలసినదిగా కోరడమైనది, ముఖ్య అతిధి నెల్లూరు సిటి M L A డా:P అనిల్ కుమార్ గారు మహిళలను సత్కరించుకొనే బాధ్యత ఎంతైనా వుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు