రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే బ్రాహ్మణులకు ఐదు కోట్ల రూపాయల వరకూ రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు బ్యాంకర్లు కూడా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అభివృద్దికి బ్యాంక్లు సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుంచి 3103 మంది పేదలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 360 మందికి రుణసౌకర్యం కల్పించడంలో బ్యాంకర్లు సహకరించాలని కృష్ణారావు కోరారు.
This Blog is created by Ramamurthy Nagar Assosciation,Nellore in order to give updates of each and every event organized by our assosciation
Sunday, 25 September 2016
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎయిర్మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఎంపీసీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు దీనికి అర్హులు. 7 జూలై 1997- 20 డిసెంబర్ 2000 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ నెల 29 లోపు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్సైట్ www.airmenselection.gov.in.
Saturday, 24 September 2016
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపిఎస్ఎల్పిఆర్బి)- ఎస్ఐ, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రన్ ఉద్యోగాల భర్తీకోసం భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పలు విభాగాల వారీగా పురుషులకు, మహిళలకు కేటాయించిన ఖాళీలను ప్రకటించారు. మొత్తమ్మీద 707 పోస్టులు ఉన్నాయి.
విభాగాలు - ఖాళీలు
స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) విభాగంలో 355 పోస్టులు, స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎఆర్) విభా గంలో 113 పోస్టులు ఉన్నాయి. వీటికి పురుషులు, మహి ళలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం పురుషులకు మాత్ర మే స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎఆర్ సిపిఎల్) విభాగంలో 9 ఖాళీలు, స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపిఎస్పీ) విభాగంలో 209 ఖాళీలు ఉన్నాయి. ప్రిజన్స్ ్క్ష కరెక్షనల్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ జైలర్ పోస్టుకు సంబంధించి పురుషులకు 16, అసిస్టెంట్ మ్యాట్రన్గా మహిళలకు 5 పోస్టులు ఉన్నాయి.
Monday, 19 September 2016
చికెన్ గున్యా లక్షణాలు మీలో కనిపిస్తే అధైర్యపడకుండా డాక్టర్లను సంప్రదించండి.
1. ఈ వైరస్ ప్రభావాన్ని నాలుగు నుంచి ఏడు రోజుల్లో గుర్తించవచ్చు.
2. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి 102 నుంచి 104 ఫారిన్ హీట్ ఉష్ణోగ్రతతో ఒళ్లు కాలిపోతుంది.
3. మోకాళ్ల నొప్పులు, వెన్నుపూస నొప్పులు అధికంగా ఉంటాయి.
4. రోజురోజుకూ వ్యాధినిరోధక శక్తి నశించి, నీరసంతో కుంగిపోతారు.
5. చిన్నారులు, వృద్ధులలో చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
6. ఈ లక్షణాలు కనిపిస్తే వ్యాధిగ్రస్తులకు వెంటనే వైద్య పరీక్షలు చేయిచండి.
Sunday, 18 September 2016
నెలాఖరులోగా వివిధ గ్రూపులకు చెందిన 4009 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో విలేకరులతో మాట్లాడారు. వీటిలో 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), 750 గ్రూప్-2 పోస్టులు, 1000 గ్రూప్-3 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. ఏఈఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ విధానం ద్వారా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను రూపొందిస్తున్నామన్నారు. క్యాలెండర్ విధానం అమలు చేయాలంటే భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి ఆరు నెలలలోపు పూర్తి చేయగలిగితేనే తిరిగి నోటిఫికేషన్ విడుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవిగాక అదనంగా బ్యాక్ లాగ్ పోస్టుల ఖాళీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీపీఎ్ససీ కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించేందుకు నాలుగెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. గుంటూరు లేదా విజయవాడలో తాత్కాలికంగా అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటుకు సమాయత్తమవుతున్నామని తెలిపారు.
Wednesday, 14 September 2016
తేదీ 08/09/2016 నాడు
మన రామముర్తినగర్ లో 1 వ మెయిన్,2 వ మెయిన్,3 వ మెయిన్ రోడ్డు నందు దక్షిణ భాగము
మరియు 2 - 3 మెయిన్ రోడ్ల మధ్య 2 వ క్రాస్ రోడ్డు నందు, 1 వ మెయిన్ రోడ్డు ఉత్తర భాగము
4 వ మెయిన్ రోడ్డు కు ఓపన్ CC డ్రైన్ వర్క్ ప్రారంభోత్సవమునకు నెల్లూరు నగర మేయర్,
సిటి TDP ఇంచార్జ్, మాజీ మునిసిపల్ చైర్ఉమన్ మరియు రామముర్తినగర్ సభ్యులు పాల్గోనినారు
మన రామముర్తినగర్ లో 1 వ మెయిన్,2 వ మెయిన్,3 వ మెయిన్ రోడ్డు నందు దక్షిణ భాగము
మరియు 2 - 3 మెయిన్ రోడ్ల మధ్య 2 వ క్రాస్ రోడ్డు నందు, 1 వ మెయిన్ రోడ్డు ఉత్తర భాగము
4 వ మెయిన్ రోడ్డు కు ఓపన్ CC డ్రైన్ వర్క్ ప్రారంభోత్సవమునకు నెల్లూరు నగర మేయర్,
సిటి TDP ఇంచార్జ్, మాజీ మునిసిపల్ చైర్ఉమన్ మరియు రామముర్తినగర్ సభ్యులు పాల్గోనినారు
అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తూ తెలుగులో ఉత్తర్వును జారీ చేసింది. భాషాభివృద్ధి కమిటీ సభ్యులుగా మండలి బుద్దప్రసాద్, పరకాల ప్రభాకర్, నాగులపల్లి శ్రీకాంత్, జీవీ రామకృష్ణారావు, విజయభాస్కర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శిలాఫలకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పేర్లు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలని యజమానులను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తెలుగు భాషా అభిమానులు, సాహితీ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tuesday, 13 September 2016
Friday, 9 September 2016
‘చేతిరాత’ పాస్పోర్టు మార్చుకోవాల్సిందే!
ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం సర్క్యులర్
హైదరాబాద్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): చేతిరాతతో ఉన్న పాస్పోర్టులను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్(మెషిన్ రీడబుల్) పాస్పోర్టులుగా మార్చుకోవాల్సిందే. చేతిరాత పాస్పోర్టులు ఇప్పటికీ 2.50 లక్షల వరకు చలామణిలో ఉన్నట్లు హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు భావిస్తున్నారు. ఇవి 20 ఏళ్ల వరకు చలామణి అయ్యేట్లుగా జారీ అయ్యాయి. ఈ పాస్పోర్టులను నవంబర్ 24లోపు మెషిన్ రీడబుల్ పాస్పోర్ట్లుగా మార్చుకోవాలని అధికారులు సర్క్యులర్ జారీచేశారు. వివరాల కోసం www.passportindia.gov.in వెబ్సైట్లో కానీ, నేషన్ కాల్ సెంటర్(1800-258-1800) టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలన్నారు.
Subscribe to:
Posts (Atom)
