Tuesday, 21 March 2017

ఆహార వేటలో సాగే దోమకు మనిషిని గుర్తించేందుకు మూడు రకాల గ్రాహకాలు తోడ్పడతాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. దృశ్య పరమైన గ్రాహకంతో పాటు వాసనను గ్రహించడం, శరీరం నుంచి వెలువడే వేడి ద్వారా మనిషిని గుర్తించి తీరిగ్గా రక్తాన్ని జుర్రుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వీటి బారినుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదని తెలిసిందే అయినా మార్కెట్లో లభించే రకరకాల రిపెల్లెంట్‌లు ఉపయోగిస్తుంటాం. అయితే దోమల ముందు వీటి పప్పులేం ఉడకవట. మహా అయితే కాసేపు దూరం పెట్టగలవేమో కానీ వాటిని పూర్తిగా అడ్డుకోవడం ఈ రిపెల్లెంట్‌ల వల్ల కాదని శాస్త్రవేత్తలు వివరించారు. పిల్లల ఆకలిని తీర్చేందుకు ఆహారాన్ని(రక్తాన్ని) వెతుకుతూ బయలుదేరిన ఆడదోమ మనిషిని అల్లంత దూరం నుంచే గుర్తిస్తుందని చెప్పారు. ‘మనిషితో పాటు ఇతర ప్రాణులు వదిలే శ్వాసను, అందులోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సుమారు 50 మీటర్ల దూరం నుంచే గుర్తించి అటుగా ఎగురుతుంది. అలా 15 మీటర్ల దూరంలోకి రాగానే తన కళ్లకు పనిచెబుతుంది. దీంతో దోమ పదిహేను మీటర్ల దూరం వరకు చూడగలదని తేలిపోయింది. ఆపై మనిషి సమీపంలోకి అంటే దాదాపు మీటరు దూరంలోకి వచ్చాక టార్గెట్‌ శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రతను గుర్తించి ముందుకు సాగుతుంది’ అని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ మైకెల్‌ డికిన్సన్‌ వివరించారు. ఆహార వేటలో దోమకు తోడ్పడే అంశాలేమిటనే దిశగా తాము నిర్వహించిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. ఇందుకోసంవీడియో కెమెరాలతో పాటు త్రీడీ ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో దోమలను పరీక్షించినట్లు మైకెల్‌ తెలిపారు.

Sunday, 19 March 2017

దొంగతనాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
 టూర్లకు, ఊర్లకు వెళ్లేవారు విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లాలి.
 తాళం చెవి ఇంటి పరిసర ప్రాంతాలలో పెట్టకూడదు.
 ఇంటి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
దూర ప్రాంతాలకు, ఎక్కువ రోజులు బయటకు వెళ్లేవారు
తప్పకుండా సంబంధిత PS పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
 అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.
 బంగారాన్ని మెరుగు పెడతామని చెప్పేవారిని నమ్మొద్దు.
 మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే మెడచుట్టూ కొంగును, ప్రత్యేక వస్త్రంతో కనిపించకుండా ఉంచాలి.
 విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు.
 ఆరుబయట వాహనాలకు హాండిల్‌లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి.
 గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాలవారిని రావద్దని చెప్పాలి.
సమీపస్తులను గానీ పని మనుషులను గానీ ప్రతీరోజు వాకిలి ఊడ్చమని చెప్పాలి.
 ఇళ్ల ముందు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
 నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి,
ఇరుగుపొరుగు వారికి మీ మొబైల్ నెంబరు ఇవ్వడం మంచిది
 టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి.
కొత్త వ్యక్తుల కదళికలపై 100 డయల్‌ లేదా 9390777727,9440796311 పోలీసు వాట్సాప్‌ నెంబర్‌కు
సమాచారం ఇవ్వాలి.

Wednesday, 8 March 2017



ఆకాశంలో సగమా :
అబధ్ధం

అణువణువునా నువ్వే స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు... ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ఆమె కాలూనని రంగం లేదు... ఆమె ధైర్యం ఓ హిమవన్నగం... ఆమె ఆప్యాయత నదీ తరంగం.... ఆమె ప్రేమ విశ్వజనీనం.... ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.... "అంతర్జాతీయ మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు  మన రామముర్తినగర్ మహిళలందరికీ

శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి
ఆకాశంలో సగమా :
అబధ్ధం
అణువణువునా నువ్వే స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు... ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా ఆమె కాలూనని రంగం లేదు... ఆమె ధైర్యం ఓ హిమవన్నగం... ఆమె ఆప్యాయత నదీ తరంగం.... ఆమె ప్రేమ విశ్వజనీనం.... ఆమె కీర్తి విశ్వవ్యాప్తం.... "అంతర్జాతీయ మహిళా" దినోత్సవ శుభాకాంక్షలు  మన రామముర్తినగర్ మహిళలందరికీ

    శ్రీకంఠం రమణయ్య
కార్యదర్శి,రామముర్తినగర్  ఓనర్స్అసోసియేషన్

Friday, 3 March 2017

ఉపాధ్యాయ/పట్టభద్ర ఓటరూ పోటీలో ఉన్న అంత మంది అభ్యర్దుల పేర్ల ఎదురుగా తమకిష్టమైన ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,...,18నెంబర్లు వ్రాసి పోటీలో ఉన్న అందరు అభ్యర్దులకూ ఓటు వేయవచ్చు. మీరు 1 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటు మొదట నమోదు అవుతుంది.
ఇక్కడ 18 మందిలో ఎక్కువ మొదటి (1) ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్ది వెంటనే గెలవడు, ఎవరు గెలవాలన్నా వారికి మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అలా వచ్చే వరకూ, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్దులను ఎలిమినేట్ చేస్తూ, ఎలిమినేట్ అయిన అభ్యర్దులకు నమోదైన ఓట్లను, ఓటరు వ్రాసిన ప్రాధాన్యతా క్రమంలో పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులకు బదలాయిస్తారు.
మీరు 1 వేసిన అభ్యర్ది చివరివరకూ పోటీలొ నిలబడలేకపోతే మీరు 2 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు, ఆ అభ్యర్దీ మధ్యలోనే ఎలిమినేట్ అయితే, మీరు 3 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు.. అలా గరిష్ఠంగా 18 సార్లు మీ ఓటు లెక్కించబడే అవకాశం ఉంది.
కాబట్టి విద్యావంతులైన పట్టభద్ర ఓటర్లు ఏ ఒక్కరికో మాత్రమే మీ ఓటు వేయాల్సిన అవసరం లేదు; బాగా ఆలోచించి, మీకిష్టమైన అభ్యర్దులందరికీ మీకు నచ్చిన ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయండి.
ఎవరైనా ఒక్క అభ్యర్థికే ప్రాధాన్యత తెలిపితే ఆ ఒక్కరికే ఓటు లెక్కించబడుతుంది

ఈ నెల 9వ తేది శాసనమండలి పట్టభద్ర/ఉపాద్యాయ ఎన్నిక జరుగుతుంది