Friday, 3 March 2017

ఉపాధ్యాయ/పట్టభద్ర ఓటరూ పోటీలో ఉన్న అంత మంది అభ్యర్దుల పేర్ల ఎదురుగా తమకిష్టమైన ప్రాధాన్యతా క్రమంలో 1,2,3,...,18నెంబర్లు వ్రాసి పోటీలో ఉన్న అందరు అభ్యర్దులకూ ఓటు వేయవచ్చు. మీరు 1 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటు మొదట నమోదు అవుతుంది.
ఇక్కడ 18 మందిలో ఎక్కువ మొదటి (1) ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్ది వెంటనే గెలవడు, ఎవరు గెలవాలన్నా వారికి మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అలా వచ్చే వరకూ, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్దులను ఎలిమినేట్ చేస్తూ, ఎలిమినేట్ అయిన అభ్యర్దులకు నమోదైన ఓట్లను, ఓటరు వ్రాసిన ప్రాధాన్యతా క్రమంలో పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులకు బదలాయిస్తారు.
మీరు 1 వేసిన అభ్యర్ది చివరివరకూ పోటీలొ నిలబడలేకపోతే మీరు 2 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు, ఆ అభ్యర్దీ మధ్యలోనే ఎలిమినేట్ అయితే, మీరు 3 వ్రాసిన అభ్యర్దికి మీ ఓటును లెక్కిస్తారు.. అలా గరిష్ఠంగా 18 సార్లు మీ ఓటు లెక్కించబడే అవకాశం ఉంది.
కాబట్టి విద్యావంతులైన పట్టభద్ర ఓటర్లు ఏ ఒక్కరికో మాత్రమే మీ ఓటు వేయాల్సిన అవసరం లేదు; బాగా ఆలోచించి, మీకిష్టమైన అభ్యర్దులందరికీ మీకు నచ్చిన ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయండి.
ఎవరైనా ఒక్క అభ్యర్థికే ప్రాధాన్యత తెలిపితే ఆ ఒక్కరికే ఓటు లెక్కించబడుతుంది

ఈ నెల 9వ తేది శాసనమండలి పట్టభద్ర/ఉపాద్యాయ ఎన్నిక జరుగుతుంది

No comments: