Sunday, 18 September 2016

నెలాఖరులోగా వివిధ గ్రూపులకు చెందిన 4009 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో విలేకరులతో మాట్లాడారు. వీటిలో 748 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ), 750 గ్రూప్‌-2 పోస్టులు, 1000 గ్రూప్‌-3 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. ఏఈఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయిందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాలెండర్‌ విధానం ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను రూపొందిస్తున్నామన్నారు. క్యాలెండర్‌ విధానం అమలు చేయాలంటే భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి ఆరు నెలలలోపు పూర్తి చేయగలిగితేనే తిరిగి నోటిఫికేషన్‌ విడుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవిగాక అదనంగా బ్యాక్‌ లాగ్‌ పోస్టుల ఖాళీలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీపీఎ్‌ససీ కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించేందుకు నాలుగెకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామన్నారు. గుంటూరు లేదా విజయవాడలో తాత్కాలికంగా అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటుకు సమాయత్తమవుతున్నామని తెలిపారు.

No comments: